Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

 అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికుల ఆర్తనాదాలు… ఇద్దరు చిన్నారుల మృతి..

  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
  • ఓ ప్రయాణికుడి కెమెరా ఆన్‌లో ఉండటంతో రికార్డ్
  • ట్రక్కును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ప్రమాదం

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బస్సులోని ప్రయాణికులు భయంతో ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఉంది.

బస్సులోని ఓ ప్రయాణికుడి కెమెరా ఆన్‌లో ఉండటంతో ఇది రికార్డ్ అయింది. వీడియో ప్రకారం ఈ బస్సు చాలా వేగంగా వెళుతోంది. ముందు వెళుతున్న లారీని, ఇతర వాహనాలను ఇది ఓవర్ టేక్ చేసింది. ఆ తర్వాత వెళ్లి లోయలోని గోడను బలంగా తాకి లోయలోకి పడిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో ఆర్తనాదాలు చేశారు.

గుజరాత్‌లోని డాంగ్ జిల్లా సాత్పూరా ఘాట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సూరత్‌కు చెందిన వారు. బస్సు డ్రైవర్ ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా బస్సు కంట్రోల్ తప్పింది. దీంతో ప్రమాదం జరిగింది.

Related posts

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Ram Narayana

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది దుర్మరణం…

Ram Narayana

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

Ram Narayana

Leave a Comment