తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకుర్ …

తెలంగాణ విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్‌ని రాష్ట్రప్రభుత్వం నియమించింది. లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు.

1953, డిసెంబర్‌ 31న జన్మించారు. 1977, జూలై 28న న్యాయవాద వృత్తిని ఆయన ప్రారంభించారు. 2010-12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్‌‌ను నియమించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్‌ లోకూర్‌ ఒకరు.

Related posts

రిటైర్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని రేవంత్ సర్కార్ పై పెన్షనర్ల కన్నెర్ర…

Ram Narayana

ఇది ప్రజాప్రభుత్వం ..ఇందిరమ్మ రాజ్యం…మంత్రి పొంగులేటి

Ram Narayana

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త .. తీపి కబురు అందించిన తెలంగాణ ప్రభుత్వం!

Ram Narayana