క్రైమ్ వార్తలు

కన్నతల్లిని చెట్టుకు కట్టేసి, సజీవ దహనం చేసిన కొడుకులు!

  • కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకుల కర్కశత్వం
  • త్రిపురలో వెలుగుచూసిన అమానుష ఘటన
  • కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు

త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఖమర్‌బరిలో ఓ 62 ఏళ్ల మహిళను ఆమె కొడుకులు ఒక చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వివరించారు.

ఒక మహిళను కాల్చివేశారనే సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడికి వెళ్లిందని, చెట్టుకు కట్టేసి కాల్చిన మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని జిరానియా సబ్-డివిజనల్ పోలీసు అధికారి కమల్ పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నామని చెప్పారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.

Related posts

కేసీఆర్ సెంటిమెంట్ ఆలయంలో దొంగల బీభత్సం!

Drukpadam

హర్యానాలో హింస.. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!

Ram Narayana

రూ.4 కోట్ల బీమా సొమ్ము కోసం దారుణం.. అన్నను టిప్పర్‌తో తొక్కించిన తమ్ముడు!

Ram Narayana