బిజినెస్ వార్తలు

తన ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు…

  • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం
  • ఉద్యోగులకు రూ330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన జొమాటో
  • ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం

తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దొడ్డ మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. దీని విలువ దాదాపు రూ.330.17 కోట్లుగా ఉంటుందని చెప్పింది. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. 

మొత్తం షేర్లలో ఈఎస్ఓపీ 2021 నుంచి 1,19,97,652 షేర్లు.. మిగిలిన 116 షేర్లు ఫుడ్డీ బే ఈఎస్ఓపీ 2014 స్కీమ్ కిందకు వస్తాయి. అయితే ఎంప్లాయిస్ కు బదిలీ చేసిన ఈ షేర్లు లాకిన్ ప్రక్రియకు లోబడి ఉండవని జొమాటో తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్లు బీఎస్ఈలో రూ.275.20 వద్ద ముగిశాయి. 

Related posts

ఆల్ టైమ్ రికార్డ్… హైదరాబాద్‌లో రూ.1 లక్ష దాటిన బంగారం ధర

Ram Narayana

ఆల్-టైమ్ రికార్డ్.. తులం బంగారం ధర రూ.1.10 లక్షలు!

Ram Narayana

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి… ఏఐ రంగంలో రిలయన్స్ గ్రూప్ సంచలనం…

Ram Narayana