Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పాకిస్థాన్‌కు చెందిన కొత్త ఉగ్రవాద గ్రూపును తుదముట్టించిన జమ్మూకశ్మీర్ సీఐకే!

  • ఆదివారం ఒక డాక్టర్, ఆరుగురు వలస కూలీలను హత్య చేసిన ఉగ్రవాదులు
  • పలు జిల్లాల్లో మేజర్ ఆపరేషన్ నిర్వహించిన జమ్మూకశ్మీర్ పోలీసులు
  • లష్కరే సంస్థకు చెందిన ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ నామరూపాల్లేకుండా చేసిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ మేజర్ పోలీస్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ నామరూపాల్లేకుండా పోయింది. శ్రీనగర్, గండెర్బల్, బండీపుర, కుల్గాం, బుద్గాం, అనంతనాగ్, పుల్వామా జిల్లాల్లో జమ్మూకశ్మీర్‌ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ (సీఐకే) మేజర్ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన శాఖ ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ (టీఎల్ఎం)ను నామరూపాల్లేకుండా చేశారు. ఈ సంస్థను పాకిస్థాన్ నుంచి ‘బాబా హమాస్’ అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక డాక్టర్, ఆరుగురు వలస కార్మికులను హత్య చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. 

Related posts

‘ఇంకొక్క డ్రింక్ ఇవ్వండి.. ప్లీజ్’ అని ఇబ్బంది పెట్టొద్దు !: కస్టమర్లకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి!

Drukpadam

అందరూ చూస్తుండగానే దుకాణ యజమానిపై కాల్పులు.. వీడియో ఇదిగో!

Ram Narayana

రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ బ్లిట్జ్‌ లో వచ్చింది… ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి?: రఘునందన్

Ram Narayana

Leave a Comment