జాతీయ వార్తలు

బాంబు బెదిరింపు… ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానం దారి మళ్లింపు..! 

  • పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు 
  • ఈరోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్
  • బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు

ఢిల్లీ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు దారి మళ్లించారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే పదుల సంఖ్యలో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

ఈ రోజు మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు.

Related posts

నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..!

Ram Narayana

భారత్‌కు ఇది చరిత్రాత్మక సమయం: సుందర్ పిచాయ్…

Ram Narayana

 భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ!

Ram Narayana