తెలుగు రాష్ట్రాలు

ములుగు కేంద్రంగా భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

  • ఈ ఉదయం 7.27 గంటలకు భూ ప్రకంపనలు
  • హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కంపించిన భూమి
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలోనూ భూకంప ప్రభావం
  • ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం

తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7.27 గంటలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది.

హైదరాబాద్‌ పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

భూకంపంతో కదిలిన సమ్మక్క గద్దెలు.. !

Mulugu Earthquake records In CCTV At Sammakka Gaddelu
  • ములుగు కేంద్రంగా ఈ ఉదయం భూకంపం
  • తెలంగాణని పలు జిల్లాలతోపాటు ఏపీలోనూ ప్రకంపనలు
  • మేడారం గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రకంపనల రికార్డు

ఈ ఉదయం ములుగు కేంద్రంగా సంభవించిన భూకంపం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్లపాటు కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున గుర్తించారు.  

హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ములుగులో ఏర్పడిన భూకంప తీవ్రతకు మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలు కంపించాయి. 

గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో భూకంపం నమోదైంది. భక్తులు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కంపించింది. అయితే, పూజల్లో నిమగ్నమైన భక్తులు అదేమీ పట్టించుకోలేదు. మరో గద్దె వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో అక్కడున్న పూజారి తీవ్రతను అనుభవించడం కనిపించింది. ఏం జరిగిందో తెలియక ఆయన అయోమయంగా దిక్కులు చూస్తుండిపోయాడు.

Related posts

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా ట్రీట్‌మెంట్‌కు సర్వం సిద్ధం

Ram Narayana

ఐఏఎస్ లకు చుక్కెదురు… డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలన్న క్యాట్!

Ram Narayana

దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ… రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్

Ram Narayana