తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

లగచర్ల రైతులకు సంఘీభావంగా.. చేతుల‌కు బేడీల‌తో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!


లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. “ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూటీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు” అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంట‌నే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఈ వినూత్న నిర‌స‌న తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

Related posts

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం

Ram Narayana

ఇష్టంలేని పెళ్లి కొడుకులా అసెంబ్లీలో కేసీఆర్… కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో… చూస్తా అనడం సరికాదు: కూనంనేని

Ram Narayana