జాతీయ వార్తలు

దోహాలో ఉద్యోగం వచ్చిన గంటల్లోనే భారత యువ ఇంజినీర్ మృతి!


ఉద్యోగం సంపాదించిన కాసేపటికే భారత్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ ఖతర్‌లోని దోహాలో గుండెపోటుతో మృతి చెందాడు. బాధితుడిని కేరళ, తిరువనంతపురంలోని పళ్లినడకు చెందిన 22 ఏళ్ల రాయీస్ నజబ్‌గా గుర్తించారు. బాధిత యువకుడికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు, సోదరి ఉన్నారు. 

యూకేలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన రాయీస్ ఉద్యోగం కోసం ఖతర్ చేరుకున్నాడు. దుబాయ్‌లోని ఓ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ అందుకున్న రోజునే గుండెపోటుతో మృతి చెందినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. అతడి మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Related posts

వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు: సీజేఐ సూర్యకాంత్

Ram Narayana

రూ.50తో టిక్కెట్ కొంటే రూ.30 లక్షల లాటరీ తగిలింది.. విజేత ఎక్కడో తెలియక డప్పులతో చాటింపు

Ram Narayana

బెంగళూరులో వైరల్ గా మారిన టూలెట్ ప్రకటన.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

Ram Narayana