తెలంగాణ వార్తలు

ప్రెస్ అకాడమీ చైర్మన్ సన్మానించిన జర్నలిస్టులు….

ప్రెస్ అకాడమీ చైర్మన్ సన్మానించిన జర్నలిస్టులు….

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు జనగామ జిల్లా జర్నలిస్టులు. ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మీడియాకాడమీ చైర్మన్ ని కలిసిన జర్నలిస్టులు తమ సమస్యలను విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన చైర్మన్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతోపాటు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయడానికి కృషి చేస్తారని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు లయన్ కన్నా పరుశరాములు, బిట్ల మధు, కాసాని ఉపేందర్, శశిధర్ జర్నలిస్ట్ లు సాగర్, ఫైఙల్ తదితరులు పాల్గొన్నారు,

Related posts

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన సమంత!

Ram Narayana

తెలంగాణలో 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం!

Ram Narayana

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో రూ.21 కోట్లకు పైగా టోకరా…

Ram Narayana