తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

  • రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • ఉపాధ్యాయ స్థానాలకు సర్వోత్తమ్ రెడ్డి, మల్కా కొమురయ్య పేర్ల ప్రకటన
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటన

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమురయ్య (పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీ అంజిరెడ్డి (సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

Related posts

ఆసక్తికరం.. ఛైర్మన్ పదవి ఇచ్చిన పార్టీకే మద్దతు అన్న స్వతంత్ర అభ్యర్థి…

Ram Narayana

ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు వట్టి మాటే: హరీశ్ రావు

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి తరుపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు …

Ram Narayana