ఆఫ్ బీట్ వార్తలు

మా ఇంటికి రాకండి ..మీకేం దొరకవు … దొంగలకు యజమాని నోటీసు

పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్‌.. నెట్టింట్లో వైరల్‌!

‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియా కంట పడగా.. వైరల్‌గా మారింది.

సహజంగా పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ.. పలువురు కామెంట్లు పెడుతున్నారు

Related posts

తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల బుడ్డోడు.. ఎందుకో తెలిస్తే..!

Ram Narayana

ల‌క్కున్నోడు.. బ్రిట‌న్ వ్య‌క్తికి రూ.1,800 కోట్ల జాక్‌పాట్‌!

Ram Narayana

కారు డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు…!

Ram Narayana