ఆఫ్ బీట్ వార్తలు

మా ఇంటికి రాకండి ..మీకేం దొరకవు … దొంగలకు యజమాని నోటీసు

పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్‌.. నెట్టింట్లో వైరల్‌!

‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియా కంట పడగా.. వైరల్‌గా మారింది.

సహజంగా పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ.. పలువురు కామెంట్లు పెడుతున్నారు

Related posts

రెయిలింగ్ పైనుంచి దూకేందుకు భారీ మొసలి ప్రయత్నం..

Ram Narayana

రూ.3 వేల లాటరీ తగిలింది.. ఆ డబ్బుతో టికెట్‌ కొంటే రూ.25 కోట్లు వచ్చాయి!

Ram Narayana

ఆలయ హుండీలో పొరపాటున ఐఫోన్ వేసిన భక్తుడు..

Ram Narayana