జాతీయ వార్తలు

మహిళపై దాడిచేసి చంపిన పులి.. ‘మ్యాన్ ఈటర్’ను చంపాలని ప్రభుత్వం ఆదేశం!

  • వయనాడ్‌లోని మనంతవాడిలో మహిళను చంపిన పులి
  • ఆమె శరీరంలోని కొంత భాగాన్ని తినేసిన వైనం
  • ఆ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన కేరళ

మహిళపై దాడిచేసి చంపిన పులిని ‘మ్యాన్ ఈటర్’గా ప్రకటించిన కేరళ ప్రభుత్వం దానిని హతమార్చాలని ఆదేశాలు జారీచేసింది. వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పనిచేస్తున్న 45 ఏళ్ల రాధపై ఇటీవల దాడిచేసిన పెద్దపులి ఆమెను చంపేసింది. ఆపై ఆమె శరీరంలోని కొంత భాగాన్ని తినేసింది. ఆ తర్వాత అటవీశాఖ అధికారి జయసూర్యపైనా దాడిచేసింది.

పులి వరుస దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అది ఎప్పుడు ఎవరిపై దాడిచేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటిస్తూ దానిని చంపేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారని మంత్రి తెలిపారు.

Related posts

మధ్యప్రదేశ్ లోని 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపుల క్లోజ్‌!

Ram Narayana

విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం!

Ram Narayana

ప్రజ్వల్ ఫ్లైట్ దిగగానే అరెస్ట్ ఖాయం …

Ram Narayana