జాతీయ వార్తలు

‘యశస్’ యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు…!

  • బెంగళూరులో ఏరో ఇండియా-2025 ఎయిర్ షో
  • హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
  • స్వదేశీ తయారీ యుద్ధ విమానంలో గగన విహారం

బెంగళూరులో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏరో ఇండియా-2025 వైమానిక ప్రదర్శన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు నేడు ఏరో ఇండియా ఎయిర్ షోకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన యుద్ధ విమానాన్ని నడపడం విశేషం. ఈ విషయాన్ని రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఏరో ఇండియా-2025 ఎయిర్ షో లో యుద్ధవిమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఏఎల్ సంస్థ దేశీయంగా తయారుచేసిన ఈ హెచ్ జేటీ-36 యశస్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం వచ్చిందని తెలిపారు. 

విమానయాన, రక్షణ రంగంలో నానాటికీ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు.

Related posts

దక్షిణ కొరియా ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన మణిపూర్ యువతి…

Ram Narayana

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్లు… 22 మంది న‌క్స‌ల్స్‌ మృతి!

Ram Narayana

ఐజీ హోదాలో ఉన్నా తప్పని కుల వివక్ష.. ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ లేఖలో సంచలన విషయాలు!

Ram Narayana