అంతర్జాతీయం

అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారత్ కు అక్రమ వలసదారులు …!

అమెరికాలో అక్రమ వలసదారుల అంశంపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గొలుసులతో బంధించి మరీ అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే 104 మంది భారతీయులను కూడా అమెరికా ప్రభుత్వం సైనిక రవాణా విమానంలో పంపించి వేసింది.

మన ప్రధాని అమెరికాలో ఉండగానే అమెరికా నుంచి మరో రెండు విమానాలు అక్రమ వలసదారులతో భారత్ చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు …ఇప్పటికే ఒక విమానం బయలుదేరగా , మరో విమానం కొన్ని గంటల్లో బయలుదేరనున్నది ..

తాజాగా, మరో 200 మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం భారత్ కు పంపించనుంది. అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఈ నెల 15న ఒక విమానం, ఈ నెల16న మరో విమానం భారత్ చేరుకుంటాయి.

Related posts

షేక్ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…

Ram Narayana

అమెరికాలో మృతి చెందిన కర్నూలు యువతి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Ram Narayana

నూతన సంవత్సరాది జరుపుకొనే తొలి దేశం ఇదే…

Ram Narayana