జాతీయ వార్తలు

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్

  • మహిళల్లో క్యాన్సర్ నివారణ కోసం టీకా
  • ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తోందన్న కేంద్రమంత్రి
  • ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు బాలికలు అర్హులని వెల్లడి 
  • టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరణ

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. వ్యాధిని గుర్తించేందుకు డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యుటీని రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

Related posts

ఇకపై ‘పంచాయతీ వాతావరణ సేవ’.. భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

Ram Narayana

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడి.. ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృతి!

Ram Narayana

ఎన్నికల వేళ బీహార్ లోకి చొరబడిన ఉగ్రవాదులు… హైఅలర్డ్

Ram Narayana