జాతీయ వార్తలు

ముంబై- దుబాయ్ విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

 50 నిమిషాల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చిన విమానం..


ముంబై నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలోనే అత్యవసరంగా దిగింది. గత రాత్రి 8 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 50 నిమిషాల ప్రయాణం అనంతరం తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Related posts

కులగణనకు కేంద్రం అడ్డుపుల్ల …ఆ అధికారం తమదేనని సుప్రీంలో అఫిడవిట్ ..!

Ram Narayana

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

Ram Narayana

చైనా, పాక్ మనకంటే ముందున్నాయి…. ‘రాకెట్ ఫోర్స్’ అవసరం: ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది

Ram Narayana