ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు!

  • గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన
  • ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా పర్యటనకు వచ్చారంటూ కేసు
  • మరికొందరు వైసీపీ నేతలపైనా కేసు నమోదు చేసిన పోలీసులు 

వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించడంపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, పర్యటనకు రావొద్దని ఈసీ, జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ… జగన్ మిర్చి యార్డు పర్యటనకు వచ్చారు. 

ఈ నేపథ్యంలో, ఆయనపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ… జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేశారు.

Related posts

జనసేనకు 25 సీట్లు ఇస్తారట… అందులో సగం స్థానాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తారట!: పేర్ని నాని వ్యంగ్యం

Ram Narayana

పల్నాడు పర్యటనలో కూటమి సర్కార్ పై జగన్ ఫైర్ …

Ram Narayana

వైసీపీకి గుడ్ బై చెబుతున్న రాపాక వరప్రసాద్!

Ram Narayana