ఆంధ్రప్రదేశ్

ప్రజాభవన్ లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం!

  • బీసీ నేతలతో సమావేశం కానున్న సీఎం రేవంత్
  • హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు
  • బీసీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. 

ఈ సమావేశంలో బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ భేటీ కీలకంగా నిలుస్తుందని నేతలు భావిస్తున్నారు.

Related posts

మొంథా తుపానును బలహీనపరిచిన ‘విండ్ షీర్’.. ఊపిరి పీల్చుకున్న కోస్తా!

Ram Narayana

మంచం కావాలన్న వల్లభనేని వంశీ… కుదరదన్న జైలు అధికారులు…

Ram Narayana

సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వో విధుల నుంచి తప్పించండి: చంద్రబాబుకు సీపీఐ లేఖ!

Ram Narayana