జాతీయ వార్తలు

చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు


హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నడిచే రెండు రైళ్ల ప్రారంభ స్థానాన్ని మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604), గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ (12589), సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ (12590) రైళ్లు ఇకపై చర్లపల్లి కేంద్రంగా నడవనున్నాయి.

దీంతో ఈ రైళ్లను ఇకపై చెన్నై సెంట్రల్-చర్లపల్లి, చర్లపల్లి-చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా వ్యవహరిస్తారు. చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్నటి నుంచే చర్లపల్లి నుంచి ప్రయాణం ప్రారంభించగా, గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైళ్ల విషయంలో మాత్రం 12, 13వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts

కేంద్ర సహాయ మంత్రి కుటుంబంలో విషాదం… చిన్న కారణంతో మేనల్లుడి హత్య!

Ram Narayana

రాత్రివేళ దారితప్పిన విదేశీ పర్యాటకురాలు… మహిళా ర్యాపిడో డ్రైవర్ సాయం..

Ram Narayana

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ!

Ram Narayana