ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఏపీ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల!

  • ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి 
    ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
  • వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ
  • మే 9న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
  • ఏప్రిల్ 29 నామినేషన్లకు చివరి తేదీ,
    మే 2 ఉపసంహరణకు గడువు

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వి. విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది.

విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల (ఏప్రిల్) 29వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాఖలైన నామినేషన్లను ఏప్రిల్ 30వ తేదీన అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి మే 2వ తేదీ వరకు గడువు విధించారు.

అనంతరం, మే 9వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, అదే రోజు (మే 9) సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి, ఫలితాన్ని వెల్లడిస్తారు.

Related posts

ఎన్నికల ప్రకటనకు ముందు ఇచ్చే హామీలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏమన్నారంటే…!

Ram Narayana

పోలింగ్ లో పొరపాట్లా… అలాంటి అవకాశమే లేదన్న సీఈసీ!

Ram Narayana

ఓటర్ స్లిప్ అందకుంటే ఏం చేయాలంటే.. !

Ram Narayana