Vishakha Patnam
ఆంధ్రప్రదేశ్

కూటమికి దక్కిన విశాఖ మేయర్ పీఠం

విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే వైసీపీ కార్పొరేట్లర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. శనివారం అవిశ్వాస తీర్మానంపై  జరిగిన సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతుగా ఓటు వేశారు. మరో వైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసినా వ్యూహం ఫలించ లేదు. దీంతో, వైసీపీ మేయర్ హరివెంకట కుమారి పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.

Related posts

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో మనమే గెలుస్తాం: బీహార్ లో రాహుల్ గాంధీ

Drukpadam

ఒంటి నిండా కుమార్తె పేరుతో పచ్చబొట్లు.. ప్రపంచ రికార్డ్

Ram Narayana

అన్న వదిలిన బాణం రివర్స్ అయి0ది …షర్మిల కా0గ్రెస్ లో చేరికపై చంద్రబాబు

Ram Narayana