Vijay Devarakonda
సినిమా వార్తలు

వివాదంలో విజయ్ దేవరకొండ

  • ఉగ్రవాదుల దాడులను గిరిజనుల ఘర్షణలతో పోల్చడంపై అభ్యంతరం
  • విజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల డిమాండ్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను కించ పరిచేలా విజయ్ మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్‌లోని పహల్గామ్ ఘటనపై స్పందించారు. ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి, వారి ఆలోచనా విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని అన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు (ట్రైబల్స్) ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రైబల్స్ అనే పదం వాడటంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.500 సంవత్సరాల క్రితం కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్టుగా విజయ్ మాట్లాడటం సరి కాదని వారు అంటున్నారు. ఉగ్రవాదుల చర్యలను ప్రత్యేకంగా గిరిజనుల నాటి ఘర్షణలతో పోల్చడం తమను కించపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ తక్షణమే గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన విజయ్, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పని పక్షంలో, తాము క్షమించేది లేదని గిరిజన సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Related posts

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి

Drukpadam

రేవంత్ రెడ్డి అనుమతితో ‘పుష్ప-2’ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్ … జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగింపు

Ram Narayana

బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనేవి చిన్న విషయాలు: దిల్ రాజు

Ram Narayana