జాతీయ వార్తలు

మరో సారి గొప్పలు చెప్పుకున్న పాక్ ప్రధాని… ఐఎన్ఎస్ విక్రాంత్ పై దాడి చేశారట!

  • పాక్ దాడిలో ఐఎన్ఎస్ విక్రాంత్ కు తీవ్ర నష్టం కలిగిందని వ్యాఖ్య
  • అబద్ధాలతో పాక్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ దేశ పీఎం

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పినప్పటికీ, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాత్రం తమ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలకు తెర లేపారు. భారత్‌పై విజయం సాధించామంటూ, ముఖ్యంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేశామని ఆయన చెప్పిన మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ … పాక్ నావికా దళం, వైమానిక దళాలను ప్రశంసిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. “భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా, కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చింది. అయితే, మన వైమానిక దళం విక్రాంత్‌పై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది. మన దెబ్బకు ఐఎన్ఎస్ విక్రాంత్ వెనక్కి భారత్ వైపు పారి పోయింది” అంటూ షెహబాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు చెప్పారు.

Related posts

అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో కేంద్రానికి రఘురామ్ రాజన్ కీలక సూచన

Ram Narayana

‘ఆమ్కా’ యుద్ధ విమానం.. హైదరాబాద్ సంస్థతో జతకట్టిన అదానీ

Ram Narayana

బీఎంసీ ఎన్నికలు.. 12 మంది జెన్-జెడ్ కార్పొరేటర్లు వీరే…

Ram Narayana