ఆంధ్రప్రదేశ్

కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లకు సత్య నాదెళ్ల సలహా

  • ఔత్సాహిక టెక్ నిపుణులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక సూచన
  • ఏఐ ప్రభావం పెరిగినా కంప్యూటేషనల్ థింకింగ్‌పై పట్టు తప్పనిసరి
  • సమస్యలను తార్కికంగా విశ్లేషించే నైపుణ్యమే అత్యంత కీలకం

సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించాలనుకునే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ సలహా ఇచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, టెక్నాలజీ నిపుణులుగా రాణించాలనుకునే వారు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ముఖ్యంగా, సమస్యలను లాజిక్ తో విడగొట్టి, క్రమబద్ధమైన పరిష్కారాలను రూపొందించే నైపుణ్యమైన ‘కంప్యూటేషనల్ థింకింగ్’ను అలవర్చుకోవాలని ఆయన నొక్కిచెప్పారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిపిన సంభాషణలో సత్య నాదెళ్ల ఈ విషయాలను పంచుకున్నారు. “ఏఐ ప్రపంచంలో, నేను ఒక బిగినర్‌గా టెక్‌లోకి ప్రవేశించాలనుకుంటే, మీరిచ్చే నంబర్ వన్ సలహా ఏమిటి?” అని ఖాడే ప్రశ్నించగా, నాదెళ్ల బదులిస్తూ, “మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే, సాఫ్ట్‌వేర్ యొక్క నిజమైన ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. నాకు తెలిసి, కంప్యూటేషనల్ థింకింగ్ సామర్థ్యం కలిగి ఉండటం ముఖ్యం” అని అన్నారు. ఏఐ కోడింగ్‌లో సహాయపడుతున్నప్పటికీ, దానికి స్పష్టమైన, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వగలగడం మానవ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది సాంకేతిక పరిజ్ఞానం, సిస్టమ్స్ థింకింగ్ కలయిక అని ఆయన అభిప్రాయపడ్డారు. “సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ అయ్యే మార్గం వేగవంతం అవుతుంది. మనమందరం త్వరలో మరింత ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్టులం కాబోతున్నాం” అని నాదెళ్ల పేర్కొన్నారు.

Related posts

విజయవాడలో ఏక దాటిగా వర్షం

Ram Narayana

రాముడు ఉత్తరాది దేవుడా? మన దేవుడు కాదా?: పవన్ కల్యాణ్

Ram Narayana

చంద్రబాబు కేసులో సీబీఐ విచారణ జరపాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్

Ram Narayana