Telangana Congress
తెలంగాణ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు .. ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

  • సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి
  • 10 ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం
  • జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు కీలక బాధ్యతలు
  • ఇన్‌ఛార్జ్‌లతో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్
  • గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు
  • వెంటనే రంగంలోకి దిగాలని నేతలకు ఆదేశం

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక చర్యలు చేపట్టింది. సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన టీపీసీసీ, తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే నియామకాలు చేపట్టిన కాంగ్రెస్, ఇప్పుడు జిల్లాలపై దృష్టి సారించింది.

ఈ నియామకాల అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నూతన ఇన్‌ఛార్జ్‌లతో జూమ్‌ వేదికగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధివిధానాలను వారికి స్పష్టంగా వివరించారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మీనాక్షి నటరాజన్‌ వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలంతా తక్షణమే క్షేత్రస్థాయిలో విధుల్లో చేరాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

Related posts

ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల పరిష్కారానికే పరిమితం కావొద్దు

Ram Narayana

సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Ram Narayana

గణపతి జనజీవన స్రవంతిలోకి రావాలి.. నేను కూడా ఆయనతో కలిసి పని చేస్తా: గోనె ప్రకాశ్ రావు

Ram Narayana