సుప్రీం కోర్ట్ వార్తలు

ఇవేం మాటలు?… రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం…

  • చైనాతో సరిహద్దులో భారత సైన్యం సరిగా పోరాడలేదన్న రాహుల్ 
  • పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ నేత 
  • ఈ కేసుపై స్టే ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం
  • ఆచితూచి వ్యాఖ్యలు చేయాలంటూ రాహుల్ కు హితవు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “దేశభక్తి ఉన్న ఏ భారతీయుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడు” అని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరట లభించింది.

ఇటీవల ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మన భారత ఆర్మీ చైనా సరిహద్దులో సరైన విధంగా పోరాడలేదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు ఒకరు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. అయినప్పటికీ, కోర్టు ఈ కేసుపై స్టే జారీ చేసింది.

రాహుల్ గాంధీ తరపున వాదించిన న్యాయవాది, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని, సైన్యాన్ని అవమానించే ఉద్దేశం రాహుల్ గాంధీకి లేదని కోర్టులో వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పరువు నష్టం కేసుపై స్టే ఇచ్చింది. అయితే, రాహుల్ గాంధీ వంటి బాధ్యతాయుత రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోర్టు సూచించింది.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు… ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Ram Narayana

పరువు నష్టం నేరం కాదు.. మార్పులు అవసరం: సుప్రీంకోర్టు!

Ram Narayana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌…

Ram Narayana