అంతర్జాతీయం

మమ్మల్ని యుద్ధంలోకి లాగొద్దు: ట్రంప్‌ వార్నింగ్‌పై స్పెయిన్‌ ప్రధాని కామెంట్‌…

  • ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తున్న వారి లక్ష్యాల్లో స్పష్టత లేదన్న పెడ్రో సాంచెజ్
  • ఇలాంటి రక్తపాతాన్ని స్పెయిన్ ఎన్నడూ కోరుకోలేదని వ్యాఖ్య
  • యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు తీర్మానాలు చేశాయన్న సాంచెజ్

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి దారితీస్తున్నాయి. మరో యుద్ధంలోకి తమ దేశాన్ని లాగవద్దని, శాంతిని కోరుకుంటున్నందుకు తమపై ఆంక్షలు విధించడం సరికాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, సాంచెజ్ ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తున్న వారి లక్ష్యాల్లో స్పష్టత లేదని, స్పెయిన్ ఎన్నడూ ఇలాంటి రక్తపాతాన్ని కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు చేసిన తీర్మానాల తర్వాతే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. ఒక దేశం చేసే చట్టవిరుద్ధమైన చర్యలకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం వల్ల మానవాళికి భారీ విపత్తులు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Related posts

చైనా రక్షణ మంత్రి అదృశ్యం!

Ram Narayana

కెనడాలో మంట‌ల్లో టెస్లా కారు.. న‌లుగురు భార‌తీయుల స‌జీవ‌ద‌హ‌నం…

Ram Narayana

అంతా బాగానే ఉంటారు: చైనా విద్యార్థుల వీసాలపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!

Ram Narayana