Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

24 గంటల వ్యవధిలో శరద్ పవార్ ను రెండోసారి కలిసిన అజిత్ పవార్

  • ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ 
  • శరద్ పవార్ ఆశీస్సులు కావాలని కోరుతున్న అజిత్ వర్గం
  • నిన్న కూడా శరద్ పవార్ ను కలిసిన వైనం

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై అజిత్ పవార్ వర్గం తిరుగుబాటు చేసి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగాయి. మరోవైపు మీ ఆశీర్వాదాలు కావాలంటూ శరద్ పవార్ ను అజిత్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ వవార్ ను అజిత్ పవార్ మరోసారి కలిశారు. గత 24 గంటల్లో శరద్ పవార్ ను కలవడం ఇది రెండో సారి. నిన్నటి మీటింగ్ తర్వాత అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ… పార్టీ చీలలేదని ప్రకటించాలని కోరినట్టు చెప్పారు. అయితే, పవార్ ఏమీ మాట్లాడలేదని, తాము చెప్పేది మౌనంగా విన్నారని అన్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.

Related posts

బిల్కిస్ బానో దోషుల విడుదలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్… !

Drukpadam

కలెక్టర్ ను కలిసిన టీయూడబ్యూజే (ఐజేయూ ) నాయకులు

Drukpadam

అయోధ్య రామమందిరంలో భక్తుల దర్శనాలకు ముహూర్తం నిర్ణయించిన ఆలయ ట్రస్టు!

Drukpadam

Leave a Comment