Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పొలంలో కనిపించిన యుద్ధ విమానం ఇంధన ట్యాంక్.. స్థానికుల షాక్

  • ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భారత వాయుసేన యుద్ధవిమానంలో సమస్యతో ఇంధన ట్యాంక్ జారవిడిచిన పైలట్
  • శిక్షణ కార్యక్రమంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వాయుసేన ప్రకటన

పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంధన ట్యాంకును చూసిన స్థానికులకు తొలుత అదేంటో అర్థంకాక హైరానా పడ్డారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు. 

యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్ నేలపైకి జారవిడిచారని వైమానిక దళ అధికారులు తెలిపారు. సాధారణ యుద్ధ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విమానం ఆ గ్రామ పరిసరాల్లో పయనిస్తుండగా ఈ సమస్య తలెత్తిందన్నారు. అది జాగ్వార్ యుద్ధ విమానమని అధికారులు పేర్కొన్నారు.

Related posts

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం!

Ram Narayana

ప్లీజ్.. గొడవ పడడం ఆపండి: మైతేయిలు, కుకీలకు మణిపూర్ ముస్లింల విజ్ఞప్తి

Ram Narayana

ఇది బీజేపీ అసలు బండారం గాంధీని చంపినా గాడ్సే విలువైన బిడ్డనట …కేంద్ర మంత్రి కితాబు ..

Drukpadam

Leave a Comment