Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో పిడుగుపాటుకు గురైన తెలుగమ్మాయి సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదన్న వైద్యులు

  • జులై మొదటివారంలో హూస్టన్ లో పిడుగుపాటు
  • కోమాలోకి వెళ్లిన సుశ్రూణ్య కోడూరు
  • వెంటిలేటర్ పై చికిత్స
  • కోమాలోంచి బయటికి వచ్చిన సుశ్రూణ్య

తెలుగమ్మాయి సుశ్రూణ్య కోడూరు ఇటీవల అమెరికాలో పిడుగుపాటుకు గురైన సంగతి తెలిసిందే. 25 ఏళ్ల సుశ్రూణ్య యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ లో ఐటీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. 

అమెరికాలో ఈ నెల మొదటి వారంలో సుశ్రూణ్య ఓ పార్కు వద్ద పిడుగుపాటుకు గురై పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయింది. ఆమెను స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి సుశ్రూణ్య కోమాలోనే ఉంది. నీటిలో పడిపోయిన సమయంలో గుండె పనితీరు 20 నిమిషాల పాటు అస్తవ్యస్తం కావడంతో మెదడు స్తంభించిపోయింది. 

ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి ఆమె దాదాపుగా అచేతనంగా ఉంది. దాంతో, ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా, ఆమె కోమా నుంచి బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ ను కూడా తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

కాగా, హైదరాబాదులో ఉన్న సుశ్రూణ్య తల్లిదండ్రులకు వీసాలు మంజూరు కావడంతో వారు త్వరలో అమెరికా చేరుకోనున్నారు.

Related posts

వర్షం కారణంగా ఫైనల్ రద్దు… ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం

Ram Narayana

కిక్కిరిసి.. కుక్కేసినట్టు.. అక్కడ అంత మంది జనమా?

Ram Narayana

హ్యూస్టన్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. ఏడుగురి మృతి

Ram Narayana

Leave a Comment