తుమ్మల,బాలసానిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య
తాను సమయం కేటాయించాలని తుమ్మల ,బాలసానిని కోరిన వీరయ్య
అందరం ఒకరోజు వస్తామని చెప్పిన నేతలు
పరస్పరం శాలువాలతో సత్కరించుకున్న నేతలు
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/10/tummala-podem.jpeg?resize=1024%2C683&ssl=1)
భద్రాచం ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొదెం వీరయ్య మాజీమంత్రి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కలిశారు . భద్రాచలం ప్రచారానికి రావాలని తుమ్మలను ,బాలసాని లను కోరారు …బాలసాని నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నందున ఆయన్ను పంపాలని తుమ్మలను కోరగా తుమ్మల ఒకరోజు ప్రచారానికి మేము వస్తాం …అంతేకాని బాలసాని నాకు చాల అవసరం ఇక్కడ ఆయన లేకపోతె ఇబ్బంది ఉంటుందని అన్నారు . ఈసందర్భంగా తుమ్మల ,బాలసానిలను పొదెం శాలువాలతో సత్కరించారు …కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని అందువల్ల మీ గెలుపు ఖాయమని పొదెం ను అన్నారు .ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలువబోతున్నామని పేర్కొన్నారు …
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/10/tummala-kalisina-podem.jpeg?resize=1024%2C683&ssl=1)