Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసు… పోలీసుల అదుపులో నిందితుడు ..

  • ప్రజాభవన్ పేలబోతుందంటూ నిన్న ఫోన్ చేసిన శివరామకృష్ణ
  • భవనాన్ని జల్లెడ పట్టి ఫేక్ కాల్‌గా గుర్తించిన పోలీసులు
  • నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు

ప్రజాభవన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేలబోతుందని నిన్న పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్‌ను జల్లెడ పట్టారు. రెండు గంటలకు పైగా తనిఖీలు చేసి… ఫేక్ కాల్‌గా గుర్తించారు.

ఈరోజు నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. శివరామకృష్ణ ముషీరాబాద్‌లో ఉంటున్నాడు. అతనిని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు.

Related posts

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

Ram Narayana

స్కూలు నుంచి ఆలస్యంగా వచ్చాడని తండ్రి పిడిగుద్దులు.. కొడుకు మృతి!

Ram Narayana

పెట్టుబడుల ఆకర్షణ కోసం జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment