Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎన్డీయే సమావేశం..ప్రధానితో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు ఉల్లాసంగా ,ఉత్సహంగా …

ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం… హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • ఛండీగఢ్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం
  • పలు కీలక అంశాలపై చర్చ
  • చంద్రబాబు, పవన్ లో ఉల్లాసంగా మాట్లాడిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఛండీగఢ్ లో నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. 

కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ సమావేశం సందర్భంగా చంద్రబాబు, పవన్ లతో ప్రధాని మోదీ ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Related posts

బీజేపీలో చేరకపోతే అరెస్టేనట: ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన ఆరోపణలు…

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి: అశోక్ గెహ్లాట్

Ram Narayana

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు

Ram Narayana

Leave a Comment