Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

రూ. లక్ష పలికిన చనిపోయిన పందెం కోడి!

సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓడిపోయినా దాని పోరాట పటిమను చూసిన పలువురు దానిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరికి ఓ వ్యక్తి దానిని లక్ష రూపాయలకు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఏలూరుకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం జరిగిన కోడిపందెంలో అది తుదికంటా పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్‌ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Related posts

తెలివి ఇన్ని రకాలా..? మన స్థాయిని నిర్ణయించేవి ఏవి?

Ram Narayana

ఇడెవండీ బాబు …మహిళకు నిప్పంటించి కాలిపోతుంటే కూర్చొని చూశాడు ..

Ram Narayana

యూట్యూబ్ లోని వీడియోలు అన్నీ చూడడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా?

Ram Narayana

Leave a Comment