అంతర్జాతీయంప్రమాదాలు ...

రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…

  • బొలీవియాలోని పొటోసీలో ఘటన 
  • మరో 39 మందికి గాయాలు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Related posts

అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏఐ పెను ముప్పు.. భారత్‌పైనా ప్రభావం!

Ram Narayana

రంగంలోకి అరబ్ దేశాలు… ఇరాన్ పై నిర్ణయం మార్చుకున్న ట్రంప్!

Ram Narayana

 ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం

Ram Narayana