Sonia, Rahul
జాతీయ వార్తలు

మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు

  • ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై వివరణ కోరిన కోర్టు
  • కేసు తదుపరి విచారణ మే 7కు వాయిదా

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, దీనిపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. గతంలో సరైన పత్రాలు లేవన్న కారణంతో నోటీసుల జారీకి నిరాకరించిన కోర్టు, తాజాగా ఈడీ అభ్యర్థన మేరకు చర్యలు చేపట్టింది. చార్జిషీట్‌పై విచారణకు ముందు నిందితుల వాదనలు వినాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేశారు.

Related posts

నా తండ్రి ఇలాగే మరణించారు .. వారి బాధను అర్థం చేసుకోగలను: రామ్మోహన్ నాయుడు

Ram Narayana

ఉగ్రవాదంపై తస్లీమా సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

ప్రాంతీయ పార్టీల ఆస్తులు.. బీఆర్‌ఎస్‌ నంబర్ 1, టీడీపీ నాలుగో స్థానం!

Ram Narayana