encounter
క్రైమ్ వార్తలు

కర్రెగుట్టల్లో ఎంకౌంటర్ … 22 మంది మావోలు మృతి ?

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. యాంటీ- మావోయిస్ట్ ఆపరేషన్లో 22 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్, ‘మిషన్ సంకల్ప్’, ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఏప్రిల్ 21న ప్రారంభమైంది. 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), CRPF కి చెందిన ఎలైట్ కౌంటర్-ఇన్సర్జెన్సీ యూనిట్ కోబ్రా (CoBRA) నుంచి సుమారు 24,000 మంది జవాన్లు పాల్గొంటున్నారు. కర్రెగుట్ట కొండలు ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాల మధ్య సరిహద్దులో ఉన్నాయి. ఈ కొండలు దాదాపు 60 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఇవి దట్టమైన అడవులు, గుహలు, జలపాతాలతో ఉన్నాయి. ఈ ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టుల అడ్డగా ఉంది. ప్రత్యేకించి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నంబర్ 1 దాక్కునేందుకు ఈ ప్లేస్ అనుకూలంగా మారింది.

Related posts

రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతికి బెదిరింపులు!

Drukpadam

పెళ్లి వేడుకలో విషాదం …బాలుడు అనుమానాస్పద మృతి …!

Ram Narayana

బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య కేసు.. ప్రధాన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు…

Ram Narayana