- జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు
- మొత్తం 21 సెషన్ల పాటు సమావేశాలు
- పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ఎన్డీయే సర్కారు
జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు నెల రోజులపాటు జరగనున్న పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఇరు పక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు . పహాల్గామ్ దాడి అనంతరం జరుగుతున్న ఈ సమావేశాల్లో దేశ భద్రత అంతర్జాతీయ జోక్యం, పాకిస్తాన్ ఇండియా మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం ఆపరేషన్ సింధూర్ లాంటివాటిని ప్రస్తావించే అవకాశం ఉంది ..దీంతో ఈ సమావేశాలు కీలకంగా మారునున్నాయి . ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా బ్లాక్ అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. అందుకు ఆదివారం ఢిల్లీ లో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. అందులో చర్చించాల్సిన అంశాలు పార్టీల ఫ్లోర్ మేనేజ్మెంట్ సమస్యలను సుదీర్ఘంగా చర్చించారు .సమావేశానికి దాదాపు 21 పార్టీలు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఆయుద్ధాన్ని తానే అపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అయితే దాన్ని అధికార పార్టీ ఖండిస్తోంది ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 (సోమవారం) నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరగనుండగా, ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్ మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది.
ఈ వర్షాకాల సమావేశాల్లో… ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ-సంపద స్థలాలు, భూపరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, భారతీయ నిర్వహణ సంస్థల (సవరణ) బిల్లు, మరియు పన్ను చట్టాల (సవరణ) బిల్లు ఉన్నాయి.
అలాగే, ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. దీనిని సోమవారం లోక్సభలో దీనిని సమర్పించే అవకాశం ఉంది.
ఇంకా, మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి మరియు రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ఆమోదించడానికి పార్లమెంట్ అనుమతిని కోరనుంది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకాయాన బిల్లు 2024, మరియు భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి.
ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్తో సహా ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా సాగనుంది. బీహార్లో ఎన్నికల జాబితాల వివాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలు ఈ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి.