తెలంగాణ వార్తలు

తెలంగాణ క్యాబినెట్‌ భేటీ సోమవారానికి వాయిదా …

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

Related posts

వరంగల్‌లో తప్పుడు కేసులు: డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులపై డీజీపీ సస్పెన్షన్ వేటు…

Ram Narayana

పాక్ లో డాక్టర్ అఫ్రీదీని తక్షణం విడుదల చేయాలి: శశి థరూర్

Ram Narayana

న్యాయపరమైన సమస్యలు రాకుండా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు …మంత్రి పొంగులేటి

Ram Narayana