కరీంనగర్ పర్యటనలో మంత్రి తుమ్మల ఫోన్ చోరీ..
వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు
కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెల్ ఫోన్ చోరీకి గురి అయింది …తన పర్యటనలో భాగంగా మంత్రి వరంగల్ -కరీంనగర్ రహదారిలో ఉన్న మండల కేంద్రమైన కేశవపట్నంలో పర్యటిస్తున్నారు …ఈ సందర్భంగా కేశవపట్నంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా ఫోన్ చోరీకి గురైంది ..వెంటనే తన ఫోన్ పోయిన విషయం పోలీసులకు మంత్రి తెలియజేశారు …రంగంలోకి దిగిన పోలీసులు కొద్దీ సేపటిలోనే మంత్రి ఫోన్ దొంగిలించిన మహిళా ఉండే చోటును గుర్తించారు …కరింపేటలోని ఓ మహిళా దగ్గర ఉన్న మంత్రి ఫోన్ స్వాధీనం చేసుకొని మంత్రికి అప్పగించారు .. ఆమె పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మంత్రి పోలీస్ అధికారులకు చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నారు …