తెలంగాణ రాజకీయ వార్తలు ..

బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచాడు.. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది: మహేశ్ కుమార్ గౌడ్

  • తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీలపైనా అనుమానం ఉందన్న మహేశ్ గౌడ్
  • దొంగ ఓట్లతోనే మోదీ అధికారంలోకి వచ్చారంటూ విమర్శ
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయమని ధీమా

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం దొంగ ఓట్లతోనే సాధ్యమైందని, తెలంగాణలోని మిగతా బీజేపీ ఎంపీల గెలుపుపైనా తమకు అనుమానాలున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లాలో చేపట్టిన జనహిత యాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, “కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్ల వల్లే జరిగింది. రాష్ట్రంలోని మిగతా 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఇలాగే గెలిచారేమోనని అనుమానంగా ఉంది” అని అన్నారు. బీసీల సమస్యలను పక్కనపెట్టి బండి సంజయ్ ఢిల్లీకి పరిమితమయ్యారని, రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ సైతం ప్రజల మద్దతుతో కాకుండా దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైందని, త్వరలోనే నాలుగో ముక్క కూడా బయటకు వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీకి భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో వందకు తగ్గకుండా సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే ఈ జనహిత యాత్ర చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయలేకపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఇళ్లను సిద్ధం చేసి చూపిస్తోందని తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లు అడగటం బీజేపీకి అలవాటు అని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి, సంక్షేమ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.

Related posts

ఖమ్మం ఎంపీ సీటు ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

తెలంగాణాలో పోటీచేసే బీజేపీ లోకసభ అభ్యర్థులు ….

Ram Narayana

ఖమ్మం జిల్లాలో అందరు ముఖ్యమంత్రులే …కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana