ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీ ఎంపీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు…

  • జగన్ ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్‌గా అభివర్ణించిన సీఎం చంద్రబాబు 
  • నేరాలు చేసి వాటిని తెలుగుదేశంపై మోపడం వైసీపీకి అలవాటని దుయ్యబట్టిన చంద్రబాబు
  • జగన్‌ అండ్‌ కో క్రిమినల్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నేతలకు సూచన

తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌‌మోహన్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు తరహాలోనే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యవహారం కూడా జగన్‌ అండ్‌ కో ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమైన అనంతరం చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ వ్యూహాలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కేంద్రం వద్ద ప్రాధాన్య అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్‌ అండ్‌ కోకే సరిపోతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నేరాల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు.

“జగన్‌ పార్టీ అంటే నేర కార్యకలాపాల కేంద్రం”

“జగన్‌ అండ్‌ కో నేరాలకే పెట్టింది పేరు. ప్రజలను మోసం చేసి, నేరాలు చేసి, తర్వాత అవే ఆరోపణలు తెలుగుదేశం నాయకులపై మోపడం వీరి అలవాటు” అని విమర్శించారు. జగన్‌ “క్రిమినల్‌ మాస్టర్‌ మైండ్‌” అని అభివర్ణిస్తూ, వివేకా హత్య తరహాలోనే ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అప్రమత్తంగా ఉండాలని సూచన

టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్‌ అండ్‌ కో క్రిమినల్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. కల్తీ మద్యం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. “జగన్‌ అండ్‌ కో చేసిన నేరాలను తెలుగుదేశం నేతల మీదకు నెట్టే ప్రయత్నం జరుగుతోంది,” అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related posts

ఇది వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ…. బాలకృష్ణ

Ram Narayana

అధికారులపై పవన్ కళ్యాణ్ అసహనం…మాజీమంత్రి అంబటి సైటైర్లు !

Ram Narayana

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల భాద్యతలు … చంద్రబాబు ,జగన్ లపై బాణాలు …

Ram Narayana