Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జర్నలిస్ట్ దారుణ హత్య … 24 కత్తి పోట్లు…

  • యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జర్నలిస్ట్ దారుణ హత్య … 24 కత్తి పోట్లు…
  • దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పౌరసమాజం …
  • యూపీ లో జర్నలిస్టులపై వరస దాడులు హత్యలు
  • గతంలో వేరు వేరు సంఘటనల్లో ముగ్గురు జర్నలిస్టుల హత్య
  • లక్ష్మీ నారాయణ్ సింగ్‌ను కత్తులతో పొడిచి చంపిన దుండగులు
  • పాత వివాదమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • విశాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మర గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ నారాయణ్ సింగ్ అలియాస్ పప్పు సింగ్ (54) అనే జర్నలిస్టును దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. నగరంలోని ఓ హోటల్ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడు హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింగ్‌కు మేనల్లుడు.

పప్పు సింగ్‌పై కత్తులతో దాడి చేసిన నిందితులు ఆయన మెడ, పొట్ట, చేతులపై విచక్షణా రహితంగా పొడిచారు. ఆయన శరీరంపై 24కు పైగా లోతైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం మృతుడికి, నిందితులకు మధ్య ఓ వివాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని అదనపు పోలీస్ కమిషనర్ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అయితే, హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు.

“ఈ హత్యకు సంబంధించి విశాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం,” అని అజయ్ పాల్ శర్మ మీడియాకు వివరించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

Related posts

ఇంటెలిజెన్స్ ఐజీ ఫోన్‌నే కొట్టేశారు!

Ram Narayana

కేంద్ర మంత్రి హెలికాఫ్టర్ కు ఇంధనం కొరత.. రోడ్డు మార్గంలో ప్రయాణించిన రాజ్ నాథ్

Ram Narayana

కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే జైలులో చైనా డ్రోన్ ప్రత్యక్షం!

Ram Narayana

Leave a Comment