ఆంధ్రప్రదేశ్

ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

  • ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలో బోల్తా పడిన బస్సు
  • ఇద్దరు మృతి, 13 మందికి గాయాలు
  • క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలింపు

నిన్న కర్నూలు, నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే, ఏలూరు వద్ద మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలోని జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

సాక్షి పత్రిక కథనంపై విచారణకు ఆదేశించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

Ram Narayana

హైడ్రా… బుడమేరులో ఆక్రమణలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం…

Ram Narayana