తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ల ఉత్సవాలకు అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి …

షడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరుతారు. అక్కడి నుంచి 10:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురంలో ఏర్పాటుచేసిన ఎలిప్యాడ్ లో దిగుతారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడే స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్కడినుంచి ముఖ్యమంత్రి నేరుగా శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం రాఘవ నిలయానికి వెళ్తారు. అక్కడ భోజనం అనంతరం
2 .40 గంటలకు బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగే సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల బహిరంగ సభలు పాల్గొని ప్రసంగిస్తారు. మూడు గంటల 50 నిమిషాలకు సర్దార్ పటేల్ స్టేడియంలోని హెలిప్యాడ్ నుండి బయలుదేరి నేరుగా మేడారం వెళతారు.

పాలేరు నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ లో గల మద్దులపల్లి సమీపంలోని ప్రారంభించనున్న జేఎన్టీయూ నర్సింగ్ కళాశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా సిపి తో సమీక్ష నిర్వహించారు.

Related posts

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు

Ram Narayana

జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే గ్యారెంటీలు అమలవుతాయి: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

Ram Narayana

హరీశ్ రావుపై పోటీ చేయడానికి నేను సిద్ధం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Ram Narayana