హైద్రాబాద్ వార్తలు

మున్సిపల్ ఎన్నికలతో బల్దియాలకు కాసుల పంట.. రూ.7.42 కోట్ల పన్ను కట్టిన నేత!

  • ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ నిబంధనతో భారీగా పన్నుల వసూలు
  • నిజామాబాద్‌లో కార్పొరేటర్ అభ్యర్థి నుంచి రూ.7.42 కోట్ల చెల్లింపు
  • ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించిన హోటల్ యజమాని

మున్సిపల్ ఎన్నికలు బల్దియాలకు కాసుల పంట పండిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు తమ పన్ను బకాయిలన్నీ చెల్లించి, ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధన ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నిబంధన దెబ్బకు ఏళ్లుగా పన్నులు కట్టని వారు కూడా ఇప్పుడు బారులు తీరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేటర్ అభ్యర్థి ఏకంగా రూ.7.42 కోట్లు చెల్లించడం దీనికి నిదర్శనం.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ యజమాని కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన తన హోటల్‌కు సంబంధించి కొన్నేళ్లుగా పన్నులు చెల్లించడం లేదు. నామినేషన్ దాఖలు కోసం ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు. పాత బకాయిలన్నీ చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక, సదరు నేత ఒకేసారి రూ.7.42 కోట్ల బకాయిలను చెల్లించి, ‘నో డ్యూస్’ పత్రాన్ని అందుకున్నారు.

ఈ ఒక్క ఘటనే కాదు, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఇదే తరహాలో పన్నుల వసూళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధన బల్దియాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో దోహదపడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

హైదరాబాద్ విమానాశ్రయాన్ని భయపెడుతున్న పక్షి తాకిడి…

Ram Narayana

హైద‌రాబాద్‌లో గ‌లీజ్ దందా.. చికెన్ ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌!

Ram Narayana

సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

Ram Narayana