ఆంధ్రప్రదేశ్

కాపు కులాన్ని కట్టుబట్టలతో వేరే రాష్ట్రానికి పంపించే కార్యక్రమం చేయండి: చంద్రబాబుకు ముద్రగడ లేఖ

  • అంబటి, జోగి రమేశ్ లను ఘోరంగా అవమానించారన్న ముద్రగడ
  • చంద్రబాబు మీద కాపు కులం కోపంగా ఉందని వ్యాఖ్య
  • పవన్ పై ప్రేమతోనే మీకు కాపులు మద్దతిచ్చారన్న ముద్రగడ

గాడి తప్పిన రాక్షస పాలనతో దహనకాండ చూస్తున్నామని కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు లేఖ రాశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ లను ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక ఇవ్వడంతో… మీరు చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావని అన్నారు. 

కాపు కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా… పవన్ కల్యాణ్ పై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందనేది తన అభిప్రాయమని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి కాపు కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని అన్నారు.

Related posts

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు!

Ram Narayana

పార్టీలన్నీ తీసికట్టు.. 2021-22లో బీజేపీకి రూ.1,161 కోట్ల ఆదాయం!

Drukpadam

హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

Drukpadam