జాతీయ వార్తలు

సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ…

  • కేంద్ర ఎన్నికల సంఘం, SIRకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మమత
  • ఈ పిటిషన్ ను ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు
  • తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించనున్న మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే… కేంద్ర ఎన్నికల సంఘం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగబోతోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. ఈ క్రమంలో తన కేసును ఆమే వాదించబోతున్నారు. 

మమత విషయానికి వస్తే… ఆమె కోల్ కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. తన పిటిషన్ కు సంబంధించి… సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో సొంతంగా వాదనలు వినిపించబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Related posts

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు…

Ram Narayana

 విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీకి నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Ram Narayana

జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana