Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్

  • సీఎం జగన్ ఓఎస్డీ కుమారుడితో పోచారం మనవరాలి వివాహం
  • స్నిగ్ధ వెడ్స్ రోహిత్ రెడ్డి
  • శంషాబాద్ వీఎన్ఆర్ ఫార్మ్స్ లో వివాహ వేడుక
  • పక్కపక్కనే కూర్చుని పెళ్లి వేడుక తిలకించిన సీఎంలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు స్నిగ్ధ వివాహం నేడు శంషాబాద్ లో రోహిత్ రెడ్డితో ఘనంగా జరిగింది. రోహిత్ రెడ్డి ఎవరో కాదు… ఏపీ సీఎం జగన్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే. ఈ వివాహ మహోత్సవానికి జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. వధూవరులు స్నిగ్ధ, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్ వేదికగా నిలిచింది. కాగా, పెళ్లి వేడుక సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కనిపించింది.

Related posts

ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి..

Drukpadam

జగన్ ఒక యంగ్ బాయ్… అవునా కాదా?.. అని జగన్ నే అడిగిన చిన్నజీయర్ స్వామి!

Drukpadam

చంద్ర‌బాబు వ‌ల్లే మాదిగ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు: మంద కృష్ణ మాదిగ‌!

Drukpadam

Leave a Comment